Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Covid-19: Karnataka's first Eta variant case found in Mangaluru

 

Covid-19: Karnataka's first Eta variant case found in Mangaluru

భారత్‌లో మరోకొత్త రకం కోవిడ్  - కర్ణాటక లో తొలి ‘ఈటా’ వేరియంట్‌ కేసు

కరోనా వైరస్ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ విస్తరిస్తోంది. బ్రిటన్లో తొలిసారి గుర్తించిన ‘ఈటా వేరియంట్’ భారత్కూ పాకింది. కర్ణాటక మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. అతడికి కరోనా పాజిటివ్గా తేలిందని, కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు పేర్కొన్నారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్న దాదాపు 100 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. ఆ వ్యక్తిలో ఈ కొత్త రకం బయటపడినట్లు వివరించారు. 

ఈటా వేరియంట్‌ను గతేడాది డిసెంబర్‌లో బ్రిటన్‌తోపాటు నైజీరియాలో గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న బ్రిటన్‌లో 56 కేసులు వెలుగుచూశాయి. డెన్మార్క్‌లోనూ పలు కేసులు బయటపడ్డాయి. ఫిబ్రవరిలో ఈ వేరియంట్‌ నైజీరియాలో విస్తృతంగా వ్యాపించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మార్చి 5 వరకు ఈటా 23 దేశాలకు పాకింది. కాగా ఈ వేరియంట్‌ తీవ్రతను తెలుసుకునేందుకు యూకేలో ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయి. కాగా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags