Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే (16-09-2021)

 

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే (16-09-2021)

 

1. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు:

హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కేటినెట్‌ ఆదేశించింది. వైద్యారోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

2. కొత్త వైద్య కళాశాలలు:

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక వసతుల అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం లభించింది.

3. కోవిడ్ కేసులు – టీకాలు:

రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు కేబినెట్‌ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.56 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. నేటి నుంచి స్పెషల్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు వివరించారు. చిన్న పిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.

4. అసెంబ్లీ, మండలి సమావేశాలు

ఈ నెల 24 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

5. పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

ఉపసంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.

6. కొత్త జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో సంఘం ఏర్పాటు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags