Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Awards to Teachers 2023 – All the Details Here

 

National Awards to Teachers 2023 – All the Details Here

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు 2023 – పూర్తి వివరాలు ఇవే

======================

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. వీరిలో విశాఖపట్నంలోని శివాజీపాలెం జీవీఎంసీ స్కూల్ కు చెందిన మురహర రావు ఉమాగాంధీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాయపాలెం మున్సిపల్ స్కూల్ కు చెందిన మేకల భాస్కరరావు, అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేట ఎస్ఆర్ఆర్ జెడ్పీ హైస్కూల్ కు చెందిన శెట్టెం ఆంజనేయులు ఉన్నారు.

ఉమాగాంధీ సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబంలో తండ్రితో పాటు ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి కూడా ఉపాధ్యాయులే. ఉమా గాంధీ 2014లో జిల్లా స్థాయిలో, 2019లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. పాలపుంత పేరుతో బాలల గేయాలతో పుస్తకం రాశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి Ph.D కూడా చేశారు.

UMA GANDHI MURAHARI RAO YOUTUBE CHANNEL 

ఇక పోలియోతో చిన్నతనంలోనే తన రెండు కాళ్లు కోల్పోయిన మేకల భాస్కరరావు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. 2012లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2018లో రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డును అందుకున్నారు. 2019లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా యుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీ దుగా అవార్డు తీసుకున్నారు.

శెట్టెం ఆంజనేయులు ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక, ఆలోచనాత్మక సామ ర్థ్యాన్ని పెంచడానికి కృత్యాధార పద్ధతిలో బోధిస్తున్నారు.

Dr. SETTEM ANJANEYULU YOUTUBE CHANNEL

======================

తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక

2023 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక య్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందినవారే.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్ కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి ఆర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు.

పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు

20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోషకుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠాలను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు.

NIPANI SCHOOL YOUTUBECHANNEL 

సొంత డబ్బులతో స్కూల్ ను తీర్చిదిద్ది..

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారం తోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది.

======================

UPDATE 27-08-2023

National Awards to Teachers 2023:

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతల జాబితా విడుదల

తెలుగు రాష్ట్రాల నుండి NAT-2023 అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు వీరే👇

LIST OF SELECTED TEACHERS

LETTER OF JOINT SECRETARY

WEBSITE

======================

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. జూన్‌ 23 నుంచి జులై 15వ తేదీ వరకు క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

======================

> 23rd June to 15th July 2023: Opening of web-portal for inviting online applications and self-nomination by teachers

> 16th July 2023 to 25th July 2023: District / Regional Selection Committee nominations to be forwarded to the State Selection Committee through online portal

> 26th July 2023 to 3rd Aug 2023: State Selection Committee / Organization Selection Committee shortlist to be forwarded to Independent National Jury

> 4th & 5th August 2023: Intimation to be issued by Ministry of Education to all the shortlisted candidates to make presentations before the National Jury (either in physical mode at NCERT like normal years or through online like in 2021 depending on Covid situation) (maximum 154 candidates as per extent guidelines)

> 7th Aug to 14th August 2023: Selection process by Jury

> 14th August 2023: Finalization of names by Independent National Jury

> 16th August -18th August 2023: Intimation to selected candidates after approval of Hon’ble Shiksha Mantri

> 4th & 5th September 2023: Rehearsal and Award function.

======================

REGISTER

LOGIN

INSTRUCTION MANUAL 2023

GUIDELINES

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags