Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Education In Mother Tongue Key Step Towards Social Justice: PM Modi

 

Education In Mother Tongue Key Step Towards Social Justice: PM Modi

మాతృభాషలో బోధన ద్వారా భారత్ లో యువ ప్రతిభకు అసలైన న్యాయం: ప్రధాని మోదీ

========================

NEP: జాతీయ నూతన విద్యావిధానంతో భారత్ లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం(జులై 29)  ప్రగతి మైదాన్ లో 'అఖిల భారత శిక్షా సమాగం' మూడో వార్షికోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక మాతృభాషలోనే జరగనుందని చెప్పారు. "సామర్థ్యం ఆధారంగా కాకుండా భాషను బట్టి విద్యార్ధుల ప్రతిభను అంచనా వేస్తున్నాం. ఇది యువ ప్రతిభకు మనం చేస్తున్న అతి పెద్ద అన్యాయం. అందుకే నూతన విద్యా విధానం తీసుకొచ్చాం. ఇక మాతృభాషలో బోధన ద్వారా భారత్ లో యువ ప్రతిభకు అసలైన న్యాయం జరగనుంది.

సామాజిక న్యాయపరంగానూ ఇది కీలక అడుగు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయి. ఐరోపానే తీసుకుంటే అక్కడ చాలా దేశాలు.. తమ స్థానిక భాషలనే వినియోగిస్తాయి. మనం మాత్రం ఎన్నో భాషలు అందుబాటులో ఉన్నా.. వాటిని వెనకబాటుతనానికి సంకేతంగానే చూపించాం. ఇంత కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది..! ఎంత తెలివైన వ్యక్తి అయినా.. అతనికి ఇంగ్లీషు రాకపోతే ఆ ప్రతిభను తొందరగా స్వీకరించం. దీని వలన గ్రామీణ భారతంలోని తెలివైన విద్యార్థులకు అతి పెద్ద నష్టం వాటిల్లింది. నూతన విద్యావిధానంతో ఈ హీన భావనను తొలగించడానికి ప్రయత్నం ప్రారంభించాం.

ఐక్యరాజ్యసమితిలోనూ నేను భారత భాషలోనే మాట్లాడతాను. దీనివల్ల వినేవాళ్లకు చప్పట్లు కొట్టడానికి సమయం పడుతుందేమో.. పట్టనీయండి. సాంఘిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక భారతీయ భాషల్లోనే జరగనుంది. నూతన విద్యా విధానంతో దేశంలో ప్రతి భాషకూ గౌరవం లభించనుంది" అని మోదీ పేర్కొన్నారు.

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags