Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

27th December Cabinet meeting decessions

27th December Cabinet meeting decessions


సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం లో చర్చించిన విషయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. వాటిలోని ముఖ్యాంశాలు.
*పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.
* మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్‌పీవీ ఏర్పాటు. రూ.11,900 కోట్లతో ఆరు దశల్లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి.
* 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. ప్రతీ ఏడాది పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం.
*కొత్తగా 108 వాహనాలు కొనుగోలుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 412 వాహనాల కొనుగోలుకు రూ.78 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ  ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చ.
* CRDA పరిధిలో జరిగిన అవకతవకల పై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీలో దేనికి అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
* రాజధాని పట్టణీకరణపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు(బీసీజీ) నివేదిక ఇంకా అందాల్సి ఉందని.. జనవరి మొదటి వారంలో బీసీజీ నివేదిక అందే అవకాశముంది. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికపై అధ్యయం చేసేందుకు హైపవర్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలో మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉంటారు.
* హైపవర్‌ కమిటీ సూచనల బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags