Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Entrance exams including EAMCET postponed

CET’S Application fee date extended

సెట్ల దరఖాస్తు ఫీజు గడువు పెంపు
రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు  ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ దరఖాస్తు గడువును పొడిగించినట్లు వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష లకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా మే 7 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags