Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Clarification in 3 days on salaries and pensions


జీతాలు, పింఛన్లపై 3 రోజుల్లో స్పష్టత
*26న మార్గదర్శకాలు?
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులకు ఏప్రిల్‌ జీతాలు, పింఛన్లపై  3 రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీటిలో గతనెల కోత విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇలాగే చేయాలని ప్రభుత్వం పేర్కొంది. అనంతరం పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇచ్చేలా నిర్ణయించింది. పింఛన్లలో కోతను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 27న ఈ కేసు విచారణకు రానుందని సమాచారం. కొన్ని విషయాల్లో స్పష్టత కోరుతూ ఖజానా ఉన్నతాధికారులు ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. కొన్ని మార్గదర్శకాలతో ఏప్రిల్‌ 26న ప్రభుత్వం నుంచి స్పష్టత రావొచ్చని విశ్వసనీయ సమాచారం. జీతాల బిల్లులు ఆయా డీడీఓలు సీఎఫ్‌ఎంఎస్‌కు సమర్పించాలి. సాధారణంగా ప్రతి నెలా 20 తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి ఇంకా ఇందుకు మార్గం తెరుచుకోలేదు. 26 తర్వాత బిల్లులు సమర్పించినా సకాలంలో జీతాలు, పింఛన్లు అందించగలమని ఖజానాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags