Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Director of treasures and accounts clarifications regarding payment of Salaries etc..

Director of treasures and accounts clarifications regarding payment of Salaries etc...


ఉద్యోగుల జీతాల వాయిదా మెమోలోని ముఖ్యాంశాలు 
* చెక్‌ల రూపంలో జీతాలు పొందే ఉద్యోగులకు పీడీ ఖాతాల ద్వారా వారికి జీతాలు అందుతాయి. వారికి సైతం 50శాతం వాయిదా వర్తిస్తుంది. వారు సగం మొత్తం జీతాలు డ్రా చేసుకుని మిగిలిన మొత్తం ఆయా పీడీ ఖాతాల్లోనే ఉంచాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఏం చేయాలనేది తర్వాత నిర్దేశించనున్నారు.
*సస్పెన్షన్‌లో ఉన్న వారికి 50% వాయిదా వర్తించబోవు. వారికి సగం జీతం మాత్రమే అందుతున్నందు వల్ల వారికి ఈ ఉత్తర్వులు వర్తింపవు.
* డీడీఓలు జీతాల బిల్లులు సమర్పించకపోతే 50శాతం బిల్లుల్లో కోత విధించి సమర్పించాలి.
* 2020 మార్చి నెలాఖరున పదవీ విరమణ చేసిన వారికి సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
* ఇతర రాష్ట్రాల వారు ఎవరైనా ఈ రాష్ట్రంలో పింఛను పొందితే ఈ ఉత్తర్వులు వర్తించబోవు.
* ఛార్జెడ్‌ మొత్తాల నుంచి జీతాలు చెల్లింపులు చేసే గవర్నర్‌, శాసనసభ స్పీకర్‌, మండలి అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, న్యాయమూర్తులకు ఇది వర్తించబోదు. జిల్లాల్లో కోర్టుల సిబ్బందికి వర్తిస్తాయి.
* గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు.. ఎవరైతే రూ.5000, రూ.4000 గౌరవవేతనం పొందుతున్నారో వారికి వాయిదా ఉండదు. ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించబోవు.
* పొరుగు సేవల సిబ్బందికి కూడా 10శాతం మొత్తం చెల్లింపులు వాయిదా వేస్తారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags