Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate permissions and admissions

ఇంటర్మీడియెట్‌ అనుమతులు, ప్రవేశాలు అన్నీ ఆన్‌లైన్‌లోనే...
ఇంటర్మీడియెట్‌ కాలేజీలకు అనుమతులు, కోర్సులు, సీట్లు, ప్రవేశాలు, ఫీజులు అన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. వసతుల కల్పన, సిబ్బంది నియామకం, వారికి జీతాలు, ప్రవేశాలు, ఫీజుల వివరాలను పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ (ఏపీఎస్‌ఈఎంఆర్సీ) నిర్ణయిస్తుంది.
* కాలేజీలు పలు రకాల ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ఇంటర్మీడియెట్‌బోర్డుకు అధికారాలు కల్పిస్తూ జీఓ జారీ చేశారు.
* అధిక ఫీజులపై క్రిమినల్‌ కేసుల నమోదు అధికారం బోర్డు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారికి ఉంటుంది.
* కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను కూడా పాఠశాల విద్య, పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ వెబ్‌సైట్లోనే పొందుపర్చనుంది.
* 2020–21 విద్యా సంవత్సరం నుండి ఈప్రవేశాలు (ఆన్‌లైన్‌) అమలు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్లు కల్పించనున్నారు.
* ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తరహాలోనే ఈప్రవేశాల్లోనూ కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం.
* వచ్చే ఏడాది నుంచి కాలేజీలకు కోర్సుల వారీగా అనుమతులకు ఇంటర్మీడియెట్‌బోర్డు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ జాబితాను బోర్డ్‌ వెబ్‌సైట్లో కాలేజీలో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలతో అప్‌లోడ్‌ చేయనుంది.
* విద్యార్థులు ఆప్షన్ల ప్రకారం ఆన్‌లైన్లో అనుమతులు పొందిన కాలేజీల్లోనే ప్రవేశాలు ఇస్తారు.
* కొత్త కాలేజీల ఏర్పాటుకు కూడా ఆన్‌లైన్‌ దరఖాస్తులనే ఆహ్వానించింది.
* విద్యార్థుల అన్ని ధ్రువీకరణ పత్రాలను బోర్డు ఆన్‌లైన్లోనే వెరిఫికేషన్‌ చేయనుంది. ఈ మేరకు టెన్త్‌ ఫలితాల వివరాలను ఎస్సెస్సీ బోర్డునుంచి, కుల, ఆదాయ, నివాస ప్రాంతాల ధ్రువీకరణకు సంబంధించి మీసేవ వివరాలను వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags