Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mana Paalana - Mee suchana Intellectual Conferences 2nd day highlights



మన పాలనమీ సూచనపేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని అంశాలపై మాట్లాడారు. వాటిలోని ముఖ్యాంశాలు..
>రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం.
>ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంట బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు.
>రైతు భరోసా కింద రూ.12500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13500లకు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా అందిస్తాం.
>రైతుభరోసా కింద రైతులకు ఇప్పటికే రూ.7500 ఇచ్చాము. మిగిలినవి అక్టోబర్ లో రూ.4000, సంక్రాంతి సమయంలో మరో రూ.2000 ఇస్తాము.
>రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చాం.
>రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.
> వ్యవసాయం లాభసాటిగా మార్చడమే లక్ష్యము.
> రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందిస్తాం.
>వ్యవసాయానికి అవసరమైన సూచనలు, సలహాలు కూడా రైతుభరోసా కేంద్రాలు అందిస్తాయి.
>ఆర్‌బీకేల ద్వారా ఈక్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం.
>పంటలు వేయడానికి ముందే గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం.
>వచ్చేఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తాం.
>రైతులు పండించే 30% పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ పంటలను ప్రభుత్వం జనతా బజార్లలో విక్రయిస్తుంది.
>రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తాం.
>దళారీ వ్యవస్థను తొలగించేందుకు ఆర్‌బీకేల ద్వారా విప్లవాత్మక మార్పులుతీసుకువచ్చాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags