Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Delhi government's decision not to open schools till July 31

పాఠశాలలను జూలై 31 వరకు తెరవకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
-సిలబస్ ను 50% తగ్గించడం, ప్రతీ తరగతికి ప్రత్యేక ఆన్లైన్ యాక్టివిటీస్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలలను జూలై 31 వరకు తెరవకూడదని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. 'జూలై 31 వరకు పాఠశాలల మూసివేత కొనసాగుతుంది. అయితే, ఆన్ లైన్ క్లాసెసను నిర్వహించుకోవచ్చు' అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శుక్రవారం తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై అధికారులతో చర్చించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు సిలబస్ ను 50% తగ్గించడం, ప్రతీ తరగతికి ప్రత్యేక ఆన్లైన్ యాక్టివిటీస్ ను రూపొందించడం.. తదితర అంశాలపై వారు చర్చించారు. 
విద్యార్థులను కొత్త పరిస్థితులకు అనుగుణంగా, భయపడకుండా తయారుచేసే విధంగా పాఠశాలలను తిరిగి తెరవడానికి ఒక ప్రణాళికను రూపొందిద్దాం. 'ఒక్కో క్లాస్ లో  12 నుంచి 15 మంది విద్యార్థులు ఉండేలా, వారానికి ఒకటి, లేదా రెండు రోజులు, రొటేషన్ పద్ధతిలో ప్రైమరీ క్లాస్ లను  నడపాలి. అవకాశమున్న ప్రతీ సందర్భంలో ఆన్లైన్ క్లాసు నిర్వహించాలి' అనే సూచనలు ఈ సందర్భంగా వచ్చాయి.  9, 10 తరగతుల విద్యార్థులను చిన్న గ్రూపులుగా విభజించి వారానికి మూడుసార్లు క్లాసులు నిర్వహించాలని అధికారులు సిసోడియాను కోరగా, మరికొందరు అధికారులు మాత్రం పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజు క్లాసులు నిర్వహించాల్సిందేనని అన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags