Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Smartphone for every student



9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ ప్రతి విద్యార్థికీ స్మార్ట్‌ ఫోన్‌
సాంఘిక సంక్షేమ గురుకులాల పాలకమండలి భేటీలో నిర్ణయం
9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివే ప్రతి విద్యార్థికీ స్మార్ట్‌ ఫోన్‌ ను అందివ్వాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల పాలకమండలి భేటీలో నిర్ణయించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహణ కు వీలుపడేలా ఒక్కొక్క విద్యార్ధికి రూ.5 వేల నుంచి రూ.6 వేల విలువగల స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనున్నది. సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో కొద్ది మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ఇతర విద్యార్థులకు ఎలాంటి ఆటంకాల్లేకుండా బోధన అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది. విద్యార్దులు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం పొందుటకు 189 గురుకులాల్లో ఆంగ్ల ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నారు. అలాగే విశాఖపట్నంలో 2, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags