Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pre-matric Post-matric scholarships 2020-21

Pre-matric Post-matric scholarships 2020-21
నూతన విద్యాసంవత్సరానికి మైనారిటీ విద్యార్థులకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌, మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌ షిప్పులకు సంబంధించి రిజిష్టర్‌ కాని ఆయా విద్యాసంస్థలు తమ లాగిన్‌ ద్వారా జులై 20వ తేదీలోగా (ఈ-కేవైసీ) దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ విద్యాసంస్థలు మైనారిటీస్‌ (ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్దులు, సిక్కులు, పార్సికులు) విద్యార్థులు స్కాలర్‌షిప్పుకు దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ https://scholarships.gov.in/ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టిట్యూట్‌ లాగిన్‌ లో నమోదు చేసుకోవాలి.
నమోదు చేసుకున్న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫాం ను నోడల్‌ అధికారి ఫోటో, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీని జతపరిచి పాఠశాల, కళాశాల హెడ్‌మాస్టర్‌, ప్రిన్సిపల్‌ ద్వారా సంతకం చేయించి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయానికి  అందజేయాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags