Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna Vidyakanuka on 5th September

సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక : మంత్రి ఆదిమూలపు సురేశ్‌
సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు-నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ నెల నుంచే ఫేజ్-2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 5, 2020న జగనన్న విద్యాకానుక నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు స్కూల్స్ పునః ప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుకతో పాటే నాడు-నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
ఫేజ్-2 లో భాగంగా 14, 538 పాఠశాలలలో నాడు-నేడు చేపడతామని చెప్పారు. జనవరి 14 నుంచి పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది జూన్ 30 నాటికి ఫేజ్ 2 పూర్తి చేస్తామని వెల్లడించారు. ఫేజ్- 3 కింద 16,489 పాఠశాలలను పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే జూన్ 30 నుంచి ఫేజ్-3 నాడు-నేడుకి శ్రీకారం చూడతామన్నారు. మొత్తం అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు 2022 నాటికి పూర్తి చేసేలా రూపకల్పన చేస్తామన్నారు.
పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు మాస్క్‌, బుక్స్‌, స్కూల్‌ యునిఫామ్‌, బ్యాగ్స్‌ ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్ట్‌బుక్స్‌ కూడా చేరాయని.. త్వరలోనే విద్యార్థులకు అందిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో గైడ్‌లైన్స్‌ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అన్ని విధాల సిద్ధంగా ఉందన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags