Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu Language Festival from today


 

Telugu Language Festival from today
నేటి నుంచి తెలుగు భాషా పక్షోత్సవం
సెప్టెంబరు 13 వరకూ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వేడుకలు

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ‘‘అంతర్జాతీయ తెలుగు భాషా పక్షోత్సవం’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి(29 ఆగస్టు) నుంచి కాళోజీ జయంతి(13 సెప్టెంబరు) వరకూ ఈ పక్షోత్సవాలను నిర్వహించనుంది. 40 రాష్ట్రేతర తెలుగు సంస్థల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాలను జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించనున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని రాష్ట్రేతర సంస్థలు శనివారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాయని వెల్లడించారు. ఆగస్టు 29 నుంచి 13 సెప్టెంబరు మధ్య ప్రతి శని, ఆదివారాల్లో కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు వెయ్యి మంది భాషావేత్తలు, కవులు పక్షోత్సవాల్లో పాల్గొంటారని, 25 వేల మంది వరకూ వీక్షిస్తారని వివరించారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags