Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Board of Education trying to launch online admissions for Inter from the Sep 28th



Board of Education trying to launch online admissions for Inter from the Sep 28th
ఈనెల 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల కొరకు విద్యా మండలి కసరత్తు

తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశాలు
10 రోజులపాటు దరఖాస్తుకు అవకాశం
ఈ ఏడాది ప్రైవేటు కాలేజీల్లోనూ రిజర్వేషన్లు

ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలను సెప్టెంబ‌రు 28 నుంచి ప్రారంభించేందుకు విద్యా మండలి కసరత్తు చేస్తోంది. దరఖాస్తులకు సుమారు 10 రోజులపాటు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే.. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఇంకా కొత్త ఫీజులను నిర్ణయించలేదు. దీంతో కాలేజీలు పాత ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుంది.

పాత ఫీజుల ప్రకారం ఫస్టియర్‌కు ఏడాదికి రూ.3,119 కాగా.. సెకండియర్‌కు రూ.3,432 మాత్రమే వసూలు చేయాలి. ఇక ప్రైవేటు కాలేజీల్లోనూ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులను చేయడంతో ఈ ఏడాది ఇంటర్‌లో చేరే వారి సంఖ్య పెరగనుంది. దీంతో కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తున్నారు.

అలాగే.. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. అనంతరం ఈ స్టడీ మెటీరయల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సబ్జెక్టుల వారీగా వర్క్‌బుక్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలకు ప్రింటింగ్‌ చేసిన మెటీరియల్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు. మిగతా వారి కోసం సంబంధిత మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

దరఖాస్తు విధానం:
విద్యార్థులు ఎక్కడి నుంచైనా ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నచ్చిన కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని కాలేజీలకైనా ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు.
ఆప్షన్స్‌ ఇచ్చే సమయంలో విద్యార్థి ఎంపిక చేసుకున్న కాలేజీ పరిస్థితులపై 25 ఫొటోలు విద్యార్థులకు కనిపిస్తాయి.
కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, ఫీజు, అకడమిక్‌ వివరాలు అందుబాటులో ఉంటాయి.
వెబ్‌సైట్‌: https://bie.ap.gov.in/


Previous
Next Post »
0 Komentar

Google Tags