Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

B.Tech admissions start at IIIT-Hyderabad - IIIT has issued notification


B.Tech admissions start at IIIT-Hyderabad - IIIT  has issued notification
IIIT- హైదరాబాద్‌లో బీటెక్‌ ప్రవేశాలు ప్రారంభం.. దరఖాస్తు చేసుకోండి..!
బీటెక్‌లో ప్రవేశాలకు ఐఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

2020-21 సంవత్సరానికిగాను బీటెక్‌లో ప్రవేశాలకు ఐఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్‌. జేఈఈ మెయిన్స్‌లో రెగ్యుల‌ర్ క్రైటేరియా ప్రకారం ఉత్తీర్ణత‌ సాధించిన వారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి తేది.

మహిళలకు ప్రత్యేకంగా 25 శాతం సీట్లు:
ప్రస్తుత అకడమిక్ ఇయర్ 2020-21కి గాను బీటెక్‌కి సంబంధించి ఐఐఐటీ- హైదరాబాద్‌లోని మొత్తం సీట్లలో 25 శాతం ప్రత్యేకంగా డైవర్సిటీ పూల్‌ పేరుతో మహిళ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో చేరే మహిళా విద్యార్థుల సంఖ్య గత నాలుగు సంవత్సరాలుగా తగ్గిపోతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది రిజర్వేషన్ కోటాకు అతీతంగా ఉంటుంది. అంటే మొదట ఈ 25 శాతం సీట్ల కేటాయించిన తర్వాతే మ‌హిళ‌ల‌కు రెగ్యులర్ సీట్లలో ప్రవేశాలు ప్రారంభిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు https://www.iiit.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Previous
Next Post »
0 Komentar

Google Tags