Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EAMCET Engineering exams completed - Primary key release on Sep 26th



EAMCET Engineering exams completed - Primary key release on Sep 26th
AP: ముగిసిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు.. ఈనెల 26న ప్రాథమిక కీ విడుదల..!
ఏపీ ఎంసెట్‌–2020కి సంబంధించి ఇంజనీరింగ్‌ విభాగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.

ఏపీ ఎంసెట్‌–2020కి సంబంధించి ఇంజనీరింగ్‌ విభాగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,56,899 మంది(84.38 శాతం) మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి (ఏపీ సెట్స్‌) డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు ఏపీలోని 47 పట్టణాల్లోని 118 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 14 సెషన్లలో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల పెంపుతో పాటు సెషన్ల సంఖ్యనూ పెంచారు. ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు ముగియడంతో.. అగ్రి, ఫార్మా, మెడికల్‌ విభాగం పరీక్షలు బుధవారం (సెప్టెంబర్‌ 23) నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ విభాగంలో 87,637 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రి, ఫార్మా, మెడికల్‌ విభాగం పరీక్షలు ఈనెల 25తో పూర్తవుతాయి. అగ్రి, మెడికల్‌ విభాగం తొలిరోజు పరీక్షకు 86.89 శాతం మంది హాజరయ్యారు. కాగా, ఎంసెట్‌–2020 ప్రాథమిక ‘కీ’ని ఈనెల 26న విడుదల చేయనున్నారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags