Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt good news for employees - Half salary if job goes!



Govt good news for employees -Half salary if job goes!
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త - జాబ్ పోతే సగం జీతం!
మీరు ఈఎస్‌ఐ స్కీమ్‌లో ఉన్నారా? అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం పోయిందా? అయితే మీకు శుభవార్త. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి కేంద్రం మీకు సగం వేతనం అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సగం వేతనం అందిస్తామని పేర్కొంది. అయితే ఈ బెనిఫిట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొందరికి మాత్రమే ఈ ఊటర లభిస్తుంది. ఈఎస్ఐసీ స్కీమ్‌లో ఉన్న వారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.

మోదీ సర్కార్ అటల్ బిమిత్ వ్యక్తి కల్యాణ్ యోజనలో భాగంగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కోవిడ్ 19 కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మాత్రమే ఈ సగం జీతం రూల్ వర్తింపజేస్తోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈఎస్ఐసీ స్కీమ్‌లో ఉన్న వారికే ఈ బెనిఫిట్ లభిస్తుంది. కేంద్ర కార్మిక శాఖ తాజాగా ఈ రూల్స్‌ను నోటిఫై చేసింది.

2020 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులకు జాబ్ పోతే సగం వేతనం అందుతుంది. అయితే అటల్ బిమిత్ కల్యాణ్ యోజన మాత్రం వచ్చే ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగం పోయిన దగ్గరి నుంచి గరిష్టంగా 90 రోజుల వరకు సగం వేతనాన్ని అందిస్తారు. ఈలోపు మరో కొత్త జాబ్ వెత్తుకోవలసి ఉంటుంది. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

ఉద్యోగం కోల్పోయిన వారికి గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు 30 రోజులలోగా డబ్బులు అందుతాయి. గతంలో ఉద్యోగం పోయిన 90 రోజుల తర్వాత డబ్బులు లభించేవి. ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న వారు ఉద్యోగం పోతే నేరుగా ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ సమర్పించొచ్చు. డబ్బులు డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాకు వచ్చి చేరతాయి. అయితే ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు సగం వేతనం పొందాలంటే కనీసం 2 ఏళ్లు ఈఎస్ఐసీ సభ్యులుగా ఉండాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి.

Previous
Next Post »
0 Komentar

Google Tags