Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Key changes in PG medical education - Effective from this academic Year



Key changes in PG medical education - Effective from this Year (2020-21)
పీజీ వైద్య విద్యలో కీలక మార్పులు.. ఇకపై ఈ అంశాలు తప్పనిసరి..!
పీజీ వైద్య విద్యలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

ప్రధానాంశాలు:
మూడు నెలల పాటు గ్రామీణ సేవలు తప్పనిసరి
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

పీజీ వైద్య విద్యలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశంలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పీజీ వైద్య విద్యార్థులందరూ జిల్లా ఆస్పత్రుల్లో మూడు నెలల పాటు సేవలందించాలి. ఈ అంశాలన్ని పీజీ వైద్య విద్యాప్రణాళికలో తప్పనిసరి చేసింది.

ఈ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి అమల్లోకి రానుంది. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956 పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఇది తప్పనిసరి. వారి పాఠ్యాంశాలలో భాగంగా మూడు నెలల పాటు జిల్లా ఆస్పత్రులు లేదా జిల్లా ఆరోగ్య శాఖలో సేవలను అందించటం తప్పనిసరి అంటూ ప్రభుత్వం అధికారిక ప్రకటనను జారీచేసింది.

ఈ నిర్ణయం వల్ల జిల్లా ఆస్పత్రులకు స్పెషలిస్టు వైద్యులు లభించటంతో పాటు.. విద్యార్థులకు క్షేత్ర స్థాయి శిక్షణ కూడా లభిస్తుంది.
కొత్త నిబంధనల మేరకు పీజీ విద్యార్థుల కోసం డిస్ట్రక్ట్‌ రెసిడెన్సీ అనే ఓ కొత్త కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని సంతృప్తికరంగా పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే సంబంధిత పీజీ కోర్సులో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత లభించనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags