Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Parliament monsoon sessions from today, Many specialties




Parliament monsoon sessions from today, Many specialties
నేటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఎన్నో ప్రత్యేకతలు
సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రత, సంరక్షణ చర్యలు, నిబంధనల మధ్య నిర్వహించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది.

కోవిడ్ 19 నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల సమయంలో అర్ధాంతరంగా వాయిదా పడిన పార్లమెంట్ సుదీర్ఘ విరామం తర్వాత నేడు సమావేశమవుతోంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పూర్తి నిబంధనలు, ఆంక్షల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ సభ్యులలో ఎక్కువ మంది పెద్ద వయసువారు కావడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు అన్ని రోజులూ సమావేశాలు జరగనున్నాయి. అయితే, రాజ్యసభ, లోక్‌సభ వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 వరకు లోక్‌సభ సమావేశం కానుంది. ఒకసభ జరిగేటప్పుడు రెండో సభ జరగదు. పార్లమెంట్ సభ్యులు రెండు సభా భవనాల్లోనూ దూరదూరంగా కూర్చుంటారు. వారి సౌలభ్యం కోసం పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. చాలావరకు కార్యకలాపాలు డిజిటల్‌ రూపంలోనే ఉంటాయి.

చేతులో తాకాల్సిన అవసరం లేకుండానే తలుపులు తెరుచుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎవర్నీ తాకుకుండానే భద్రత/ ఆరోగ్యపరమైన తనిఖీలు నిర్వహిస్తారు. ఎంపీలకు డీఆర్‌డీవో ద్వారా కొవిడ్‌-19 కిట్లు పంపిణీ చేస్తున్నారు. వాటిలో మాస్కులు, శానిటైజర్లు తదితరాలు ఉంటాయి. సభలో ప్రవేశపెట్టే పత్రాలకూ అతినీలలోహిత కిరణాలతో శుద్ధి చేయనున్నారు.

ఎంపీల వ్యక్తిగత సీట్లకు మైక్‌లు లేకుండా మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేశారు. వారు కూర్చునే చోట ప్లాస్టిక్‌షీట్ సెపరేటర్లు ఉంచారు. భారత పార్లమెంటు చరిత్రలో సమావేశాన్ని నిర్వహించడానికి రెండు గదులు విలీనం కావడం ఇదే తొలిసారి. రాజకీయ పార్టీలకు ప్రధాన గదులు, విజిటర్స్ గ్యాలరీలలో నిర్దిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించారు. ఆయా పార్టీల ఎంపీలు ఎక్కడ కూర్చున్నారో నామినేట్ చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. 

కరోనా నేపథ్యంలో ఎంపీల సంతకాలకోసం పార్లమెంటు ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. సంతకం చేసే సమయంలో సాధారణ హాజరు నమోదు పుస్తకంపై చేతులుపెట్టే అవకాశం ఉండటంతో వైరస్‌ వ్యాప్తి ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఈ యాప్‌ను తయారుచేసింది. కేవలం పార్లమెంటు కోర్‌ ఏరియాలో మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags