Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tomorrow is the JEE Advanced Exam .. Here are the latest updates ..!



Tomorrow is the JEE Advanced Exam .. Here are the latest updates ..!
రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష.. తాజా అప్‌డేట్స్‌ ఇవే..!

దేశవ్యాప్తంగా రేపు (సెప్టెంబ‌రు 27) నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల కేటాయింపు పూర్తయిందని దిల్లీ ఐఐటీ వెల్లడించింది. ఫీజు చెల్లించిన విద్యార్థుల్లో 97.94 శాతం మందికి దరఖాస్తులో నమోదు చేసిన మొదటి మూడు ప్రాధాన్య నగరాల నుంచే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఐఐటీ ఢిల్లీ ప్రకటిచింది.

మిగిలిన 2 శాతం విద్యార్థులకు వారు ఎంచుకున్న 8 ప్రాధాన్య నగరాల నుంచి పరీక్ష కేంద్రాలను కేటాయించామని వివరించారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు ప్రక్రియను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేపట్టామన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.

హాల్‌టిక్కెట్‌పైనే పరీక్ష గది వివరాలు:
పరీక్ష కేంద్రం చిరునామా తెలిసినా.. అక్కడికి వెళ్లి పరీక్ష గది ఎక్కడుందో తెలుసుకోవడానికి బయట బోర్డు వద్ద విద్యార్థులు గుమిగూడటం సర్వసాధారణం. కరోనా నేపథ్యంలో గుమిగూడటాన్ని నిరోధించేందుకు సెప్టెంబ‌రు 27వ తేదీన జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. విద్యార్థుల హాల్‌టికెట్‌లోనే పరీక్ష కేంద్రంలో ఏ గది/ల్యాబ్‌లో సీటు కేటాయించారో ఆ వివరాలు పొందుపరిచారు.

కాకపోతే హాల్‌టిక్కెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి నేరుగా వెళ్లిన తర్వాత సిబ్బంది హాల్‌టిక్కెట్‌(అడ్మిట్‌ కార్డు)ను స్కానింగ్‌ చేసి మీకు కేటాయించిన కంప్యూటర్‌ ఏ ల్యాబ్‌లో ఉందో చెబుతారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags