Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Good news for Inter students, 30% syllabus cut, Govt given green signal


TS: Good news for Inter students, 30% syllabus cut, Govt given green signal
ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 30% సిలబస్‌ కోత.. పూర్తి వివరాలు ఇవే..!
విద్యార్థులు, అధ్యాపకులపై ఒత్తిడి తగ్గించాలని ఇంటర్‌ బోర్డు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో తగ్గించిన సిలబస్‌పై ప్రకటన.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటివరకు నష్టపోయిన పనిరోజులకు అనుగుణంగా ఈ సిలబస్‌ని తగ్గించనున్నారు.

సీబీఎస్‌ఈ మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టు‌ల్లో తగ్గించిన సిలబస్‌కు అనుగుణంగానే.. రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌‌లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించనున్నారు. ఇక అంతకుముందు పనిదినాలు 222 ఉంటే.. ఈ ఏడాది 40 రోజులు తగ్గించి, 182 రోజులుగా పరిమితం చేశారు. తొలిగించిన పాఠ్యాంశాల వివరాలకు సంబంధించి త్వరలోనే ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించనుంది.

27 వేల మంది పాస్‌..!
మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి.. పలు కారణాలతో పరీక్షలు రాయని 27వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. అటు ఏపీలోనూ ఇంటర్‌ విద్యార్థులకు సిలబస్ తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
  
ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ప్రవేశాలు:
రాష్ట్రంలో ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన ప్రభుత్వ కాలేజీలు, సంక్షేమ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ కాలేజీలు, కేజీబీవీలు, ఫైర్‌ ఎన్‌వోసీ ఉన్న 77 ప్రైవేటు కాలేజీలు మొత్తంగా 1,136 కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 1,496 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు జారీ చేయలేదు. అయితే అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ కొనసాగుతోందని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా https://tsbie.cgg.gov.in/ అందుబాటులో ఉన్న ఈ కాలేజీల్లో చేరవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇతర కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags