Engineering classes starts from December
1
డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్
తరగతులు
ఇంజనీరింగ్, డిప్లామా
తదితర కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించేలా అఖిల భారత
సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ప్రత్యామ్నాయ క్యాలెండర్ను ప్రక
టించింది. ఇప్పటికే ఐఐటీలు, ఎన్ఐటి లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో
పాటు పలు రాష్టాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం
తీసుకున్నట్టు మండలి సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
నవంబర్ 30 నాటికి ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తి చేసి డిసెంబర్ 1 నుంచి తరగతులు
ప్రారంభించాలని వివరించారు. ఇంతకు ముందు నవంబర్ 1 నాటికి చివరి విడత సీట్ల
కేటాయింపు పూర్తి చేసి అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా ఏఐసీటీఈ
ప్రకటించింది. తాజాగా దాన్ని నవంబర్ 30 నాటికి అడ్మిషన్లను పూర్తి చేసి డిసెంబర్ 1
నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.
0 Komentar