Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Good News for Govt Employees on LTA

 

Good News for Govt Employees on LTA

ఉద్యోగులకు పండుగ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం!

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌టీఏను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. 

కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. అదిరిపోయే పండుగ గిఫ్ట్ అందించింది. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA)‌ ఫెసిలిటీని పొడిగించింది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీఏ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈశాన్య ప్రాంతం, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్ల పాటు ఎల్‌టీఏ పొడిగిస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది. 

ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్‌తోపాటుగా ట్రావెల్ అలవెన్స్ కూడా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించినా కూడా ట్రావెల్స్ అలవెన్స్ పొందొచ్చు. ఎకానమీ క్లాస్ టికెట్లను బుక్ చేసుకోవాలి. 2022 సెస్టెంబర్ 25 వరకు పైన పేర్కొన్న ప్రాంతాలకు ఉద్యోగులు హాలిడేకు వెళ్లొచ్చు. ట్రావెల్ అలవెన్స్ పొందొచ్చు. 

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎల్‌టీఏ అందిస్తుంది. ఉద్యోగులు లేదా ఆఫీసర్లు హాలిడేకు వెళ్లినప్పుడు ట్రావెల్ ఖర్చులను మళ్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు. కుటుంబంతో కలిసి లేదంట ఒంటరిగానే ఉద్యోగులు హాలిడే ట్రిప్‌కు వెళ్లి రావొచ్చు. ఎల్‌టీఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. డీఏ పెంపు లేని నేపథ్యంలోని ఉదయోగులకు ఎల్‌టీఏ పొడిగింపు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags