Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI asks lending institutions to implement waiver of interest on interest scheme

 


RBI asks lending institutions to implement waiver of interest on interest scheme

గుడ్ న్యూస్: వడ్డీ మాఫీ నిధులు వెంటనే అకౌంట్లలోకి.. బ్యాంకులకు RBI ఆదేశం

Interest Waiver: బ్యాంకు రుణాలపై మారటోరియం కాలానికి చక్రవడ్డీ మాఫీ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకుల, ఆర్థిక సంస్థలకు RBI ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 5లోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. 

చక్రవడ్డీ మాఫీ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. 6 నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు RBI సూచించింది. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను లోన్లు తీసుకున్న వారి ఖాతాల్లో వెంటనే జమ చేయాలని కేంద్రం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. ఈ ప్రక్రియను నవంబరు 5 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆర్థిక సంస్థలను కోరింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 

చక్రవడ్డీ అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అక్టోబర్‌ 14న కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి సూచించింది. ఆ ఆదేశాల నేపథ్యంలో చక్రవడ్డీని మాఫీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. 

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. హౌస్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వెహికిల్ లోన్లు, ఎంఎస్‌ఎంఈ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు లాంటివి ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ స్కీమ్‌ వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్‌పీఏగా గుర్తించి ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. 

సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాకు సమానమైన మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లో జమ చేయాలి. ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్‌ చేస్తుంది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులకు గురైన వారికి ప్రయోజనం కలిగించేలా ఆత్మనిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags