Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI excluded six public sector banks from the Second Schedule of the RBI Act



RBI excluded six public sector banks from the Second Schedule of the RBI Act
ఆంధ్రా బ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులను తొలగించిన ఆర్‌బీఐ.. లిస్ట్‌‌లో నుంచి ఔట్!

రిజర్వు బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్‌బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇక ఆ బ్యాంకులు ఆర్‌బీఐ పరిధిలోకి రావు.

లిస్ట్ నుంచి 6 బ్యాంకుల తొలగింపు
ఆర్‌బీఐ నోటిఫికేషన్
ఇక అవి కమర్షియల్ బ్యాంకులు కావు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఆరు బ్యాంకులను ఆర్‌బీఐ యాక్ట్‌లోని సెకండ్ షెడ్యూల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రధాన కారణంగా ఉంది. ఈ ఆరు బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం అయిపోవడం ఇందుకు ప్రధాన కారణం.

ఆర్‌బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్ నుంచి పేరు కోల్పోయిన బ్యాంకుల విషయానికి వస్తే.. ఇందులో ఆంధ్రా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఇకపై ఈ బ్యాంకులు ఆర్‌బీఐ పరిధిలో ఉండవు.

ఆర్‌బీఐ బ్యాంకులను రెండో షెడ్యూల్ నుంచి తొలగిస్తున్నట్లు ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. ఆర్‌బీఐ యాక్ట్‌లోని రెండో షెడ్యూల్‌లో పేరు కలిగిన బ్యాంకులను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులుగా పేర్కొంటాం. పైన పేర్కొన్న ఆరు బ్యాంకులు ఇతర బ్యాంకులతో ఏప్రిల్ 1 నుంచి విలీనం అయిపోయిన విషయం తెలిసిందే.

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB లో విలీనం అయ్యాయి. సిండికేట్ బ్యాంక్ మాత్రం కెనరా బ్యాంక్‌లో కలిసిపోయింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ మాత్రం ఇండియన్ బ్యాంక్‌లో కలిసిపోయింది. ఈ విలీనం తర్వాత దేశంలో ఏడు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు చిన్న బ్యాంకులు ఉన్నాయి. 2017లో 227 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 12కు తగ్గింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags