Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana gets 150 more MBBS seats from 2020-21

 


Telangana gets 150 more MBBS seats from 2020-21

TS: రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు.. ఈనెల చివరి వారంలో ఆలిండియా కోటా నోటిఫికేషన్‌..!

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. 

రాష్ట్రంలో 5,040కి పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

ఒకేసారి రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితా, దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ 

ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్‌ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న నీట్‌ ఫలితాలు వెలువడినా.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం పంపలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితా, దరఖాస్తుల స్వీకరణ నోటిఫికేషన్‌‌ ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు మినహాయించి రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం (230) సీట్లను ఆలిండియా కోటాకు ఇస్తున్నారు. 

అదనంగా 150 ఎంబీబీఎస్‌ సీట్లు:

మరోవైపు రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు కూడా పెరిగాయి. తాజాగా టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి అనుమతి రావడంతో అదనంగా 150 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags