Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Notification issued for Management Quota seats in Private Engineering Colleges

 

 TS: Notification issued for Management Quota seats in Private Engineering Colleges

 మేనేజ్‌మెంట్ కోటా‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..!

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఈ విద్యాసంవత్సరం (2020-21)కి గాను రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి తెలంగాణ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 30 శాతం సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీఈ/బీటెక్‌, బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులకు సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు భర్తీ చేస్తారు. 

అయితే కాలేజీల వారీగా మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 18లోగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలని.. వచ్చే నెల 5వ తేదీలోగా సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

అయితే మేనేజ్‌మెంట్ కోటాలో చేర్చుకున్న విద్యార్థుల జాబితాను తమకు సబ్మిట్ చేసే తేదీని తరువాత వెల్లడిస్తామని ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వెలువడటమే కాకుండా.. ఇంజనీరిగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. 

DOWNLOAD NOTIFICATION 

వీళ్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021 రాయొచ్చు..!

జేఈఈ అడ్వాన్స్ డ్-2020లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని సంబంధిత జాయింట్ అడ్మిషన్ల బోర్డు నిర్ణయించింది. కోవిడ్-19 కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఇదో మంచి అవకాశం. అయితే వీరు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష రాయకుండానే.. జేఈఈ అడ్వాన్స్ డ్-2021లో పరీక్ష రాయొచ్చు. 

జేఈఈ అభ్యర్థులకు సమన్యాయం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 అడ్వాన్స్ డ్‌కు అవకాశం పొందిన అభ్యర్థులు అదనపు అభ్యర్థులుగా పరిగణిస్తారు. 2021 జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన వారి సంఖ్యకు వీరు అదనం. అర్హతలు, వయసు, ఇతర అంశాల్లో కూడా వీరికి సడలింపు ఇస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags