Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Andhra Pradesh Government Key Decision on Deepavali Crackers and Celebrations

 


Andhra Pradesh Government Key Decision on Deepavali Crackers and Celebrations

దీపావళి టపాసులు, సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

దీపావళి టపాసులు, సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది.. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

కరోనా సమయంలో దీపావళి టపాసులు, సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటు టపాసులు పేల్చడానికి అనుమతి ఇచ్చింది.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చుకోవాలని సూచించింది. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. దీపావళి సామాగ్రి వ్రికయించే షాపుల దగ్గర శానిటైజర్ వాడొద్దని సూచన చేసింది. ప్రజలు నిబంధనల్ని తప్పక పాటించాలని ఆదేశించింది. 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బాణాసంచా వాడకాన్ని నిషేధించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీపావళిపై పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దీపావళికి టపాసుల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం.. కాలుష్యం వల్ల అది మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, కర్నాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు గంటలు అనుమతి ఇచ్చింది. జనాలు ఏ మాత్రం నిబంధనలు పాటిస్తారన్నది చూడాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags