Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Inter Admissions 2020 21 Update Details

 


AP Inter Admissions 2020 21 Update Details

ఏపీ: పది పాసైన వారందరికీ ఇంటర్‌ అడ్మిషన్

పది పాసైన ప్రతి ఒక్కరికీ ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీటు లభిస్తుందని ఇంటర్‌ బోర్డు తెలిపింది. 

అందుబాటులో 7,42,780 సీట్లు

గెస్ట్‌ ఫ్యాకల్టీతో ఖాళీల భర్తీ 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 10వ తరగతి పాసైన ప్రతి ఒక్కరికీ ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో సీటు లభిస్తుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింపు, సీట్ల సంఖ్య కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటాయని.. ఈ విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 

అలాగే ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదన్నారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల గురించి మార్చిలోనే అన్ని కాలేజీలకు సర్క్యులర్‌ ఇచ్చామని.. బోర్డు వెబ్‌సైట్‌లో యూజర్‌ మాన్యువల్‌ విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు వారి ఇన్‌టేక్‌ వివరాలు నమోదు చేయనందున వాటి పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదన్నారు. 

బోర్డు మంజూరు చేసిన గ్రూపులు, సెక్షన్ల ప్రకారం వాటిని ఆన్‌లైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఫైర్‌ ఎన్‌ఓసీ లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాపార భవన సముదాయాల్లో, రేకుల షెడ్లలో నడుస్తున్న కళాశాలలకు 2020-21కి మాత్రం అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొత్తగా మంజూరు చేసిన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. రాష్ట్రంలో ఎటువంటి సీట్ల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. 

గెస్ట్‌ ఫ్యాకల్టీతో ఖాళీల భర్తీ:

ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో రెగ్యులర్‌, కాంట్రాక్టు ఫ్యాకల్టీ లేనిచోట్ల గంటల ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు అనుమతిస్తూ ఇంటర్‌ విద్యా కమిషనర్‌ వి.రామకృష్ణ ఉత్తర్వులు ఇచ్చారు. వారి రెమ్యునరేషన్‌ గంటకు రూ.150, నెలకు సబ్జెక్టుకు రూ.10వేలు మించకుండా చూడాలని సూచించారు. 

ఇక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అవసరాల మేరకు అధ్యాపకులు ఉన్నారని రామకృష్ణ పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన 84 కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించామని తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో 237 మంది జేఎల్స్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags