Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt approves PLI scheme worth ₹2 lakh crore for 10 key sectors

 


Govt approves PLI scheme worth ₹2 lakh crore for 10 key sectors

మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.2 లక్షల కోట్లతో కొత్త స్కీమ్‌కు ఆమోదం!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల కోట్లతో పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. 10 రంగాలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ను ఆయా మంత్రిత్వ శాఖలు వెంటనే అమలు చేయనున్నాయి. 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కొత్త స్కీమ్‌కు ఆమోదం

రూ.2 లక్షల కోట్ల వరకు కేటాయింపు 

మోదీ సర్కార్ తీపికబురు అందించింది. కరోనా వైరస్ దెబ్బకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవడానికి ప్రత్యేక స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని పేరు పీఎల్‌ఐ స్కీమ్. కేంద్ర కేబినెట్ ఈ పీఎల్ఐ స్కీమ్‌కు ఆమోదం కూడా తెలిపింది. 10 రంగాలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సె‌న్‌టివ్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. 

కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమ్‌కు ఏకంగా రూ.2 లక్షల కోట్లు వరకు కేటాయించింది. వచ్చే ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఈ స్కీమ్ కింద పలు రంగాల కోసం ఖర్చు చేయనుంది. అన్ని రంగాల్లోకెల్లా వాహన రంగానికి, వాహన విడిభాగాల రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది. 

మోదీ సర్కార్ ఈ రంగాల కోసం రూ.57 వేల కోట్లు కేటాయించింది. స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా తయారు చేసిన ప్రొడక్టులను రాయితీలు అందిస్తుంది. అలాగే వీటిని ఇతర దేశాలకు ఎగమతి కూడా చేయొచ్చు. అడ్వాన్స్ సెల్ కెమిస్ట్ర బ్యాటరీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రొడక్షన్, వైట్ గూడ్స్, టెక్స్‌టైల్, టెలింక అండ్ నెట్‌వర్కింగ్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ వంటి రంగాలకు కూడా కేటాయింపులు దక్కాయి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

దేశంలో ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎల్ఐ స్కీమ్ కింద కీలకమైన రంగాలకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. దేశంలోకి ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం కోసం ఈ ఆర్థిక మద్దుతు అందిస్తున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన మంత్రులు, విభాగాలు వెంటనే స్కీమ్స్‌ను అమలు చేస్తాయని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags