Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Lakshmi Vilas Bank under moratorium, to be merged with DBS

 

Lakshmi Vilas Bank under moratorium, to be merged with DBS

ఆర్‌బి‌ఐ కీలక నిర్ణయం.. లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను మరో బ్యాంక్‌లో విలీనం చేసేందుకు రెడీ

బ్యాంకుల సంఖ్య మళ్లీ తగ్గనుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో విలీన స్కీమ్‌ను ప్రకటించింది. ఒక బ్యాంక్‌ను మరో బ్యాంక్‌లో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్‌ను కూడా విడుదల చేసింది. 

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను మరో బ్యాంక్‌లో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ముసాయిదాను కూడా విడుదల చేసింది. ఈ బ్యాంక్‌ను డీబీఎస్ ఇండియా బ్యాంక్‌తో విలీనం చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. డీబీఎస్ అనేది సింగపూర్‌కు చెందిన బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. దీని అనుబంధ బ్యాంకే డీబీఎస్ ఇండియా బ్యాంక్. 

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం లక్ష్మీ విలాస్ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఈ బ్యాంక్‌పై డిసెంబర్ 16 వరకు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మారటోరియం ప్రకటన వెలువడిన వెంటనే ఆర్‌బీఐ కూడా విలీన ప్రతిపాదన నిర్ణయాన్ని వెల్లడించింది. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ మారటోరియం అంశానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆర్‌బీఐ నుంచి తదుపరి అనుమతులు వచ్చే వరకు బ్యాంక్ రూ.25,000కు పైన ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. బ్యాంక్‌లో డబ్బులు కలిగిన వారు మారటోరియం సమయంలో కేవలం రూ.25 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. 

కాగా ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వపు అనుమతితో లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్లను తొలగించింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా క్షీణించడంతో ఆర్‌బీఐ బోర్డును 30 రోజులు సస్పెండ్ చేసింది. కెనరా బ్యాంక్‌కు చెందిన మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. 

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో యస్ బ్యాంక్ విషయంలోనూ రిజర్వు బ్యాంక్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజా మారటోరియం నిర్ణయంతో బ్యాంక్ కస్టమర్లు భయపడాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. డబ్బులు ఎక్కడికీ పోవని భరోసా ఇచ్చింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags