Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mandatory to Prefix 0 For Making Landline-To-Mobile Calls From 2021 January 1

 


Mandatory to Prefix 0 For Making Landline-To-Mobile Calls From 2021 January 1

జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇక మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే ఇలా చేయాల్సిందే!

మీకు ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారా? మరీముఖ్యంగా ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తుంటారా? అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి. కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) తాజాగా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే కచ్చితంగా నెంబర్‌కు ముందు జీరో నెంబర్‌ను యాడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2021 జనవరి 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది. 

టెలికం రెగ్యలేటర్ ట్రాయ్ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం రంగంలో ఎక్కువ నెంబర్లను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే మాత్రం కచ్చితంగా జీరో ముందుగా నొక్కాలి. జీరో తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

ల్యాండ్ లైన్ కలిగిన వారు మొబైల్ ఫోన్‌కు కాల్ చేస్తే జీరో ఎంటర్ చేసి కాల్ చేయాలనే అనౌన్స్‌మెంట్ వారికి వినిపిస్తుంది. డాట్ ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతి ఒక్క టెలికం కంపెనీకి ఈ రూల్స్ వర్తిస్తాయని డాట్ స్పష్టం చేసింది. 

అందుకే డాట్ కూడా టెలికం కంపెనీలకు కొత్త రూల్ అమలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. ల్యాండ్ లైన్ డయలింగ్ ప్యాట్రన్ మార్పు వల్ల అదనంగా చాలా నెంబర్లు టెలికం కంపెనీలకు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందువల్ల ల్యాండ్ లైన్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించాలి. 

Previous
Next Post »
0 Komentar

Google Tags