Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Total Ban on Firecrackers in Delhi, Restrictions in Other Parts Says National Green Tribunal

 


Total Ban on Firecrackers in Delhi, Restrictions in Other Parts Says National Green Tribunal

బాణా సంచా విక్రయాలపై ఎన్జీటీ సంచలన నిర్ణయం.. నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి!

కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్, ఒడిశా, ఢిల్లీ రాాష్ట్రాలు ఇప్పటికే టపాసుల కాల్చడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై హరిత ట్రైబ్యునల్ సంచనల తీర్పు వెలువరించింది. 

దేశ రాజధాని ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో టపాసుల కాల్చడం, అమ్మకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరు 30 వరకు బాణా సంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టు ఎన్‌జీటీ తెలిపింది. నేటి అర్ధరాత్రి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. క్రిస్‌మస్ సహా న్యూఇయర్ రోజుల్లో బాణా సంచా కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతిచ్చింది. క్రిస్‌మస్, న్యూఇయర్ రోజున మధ్యాహ్నం 12 నుంచి 2.00 గంటల మధ్య కాల్చుకోవాలని ఆదేశించింది. 

ఢిల్లీతోపాటు కాలుష్యం ఎక్కువగా నగరాల్లోనూ ఆంక్షలు విధించింది. గాలి నాణ్యత మోడరేటివ్‌గా ఉన్న నగరాల్లో మాత్రం గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే టపాసుల విక్రయాలు, కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. 

బాణా సంచా విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. గతవారం 23 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబరు 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించాలా? వద్దా? అని ఎన్‌జీటీ చైర్మన్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ ధర్మాసనం గత బుధవారం రాష్ట్రాల స్పందన కోరింది. 

కొవిడ్‌-19, వాయు కాలుష్యంపై నిపుణుల అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయని, పెరిగిన వాయు కాలుష్యంతో వైరస్‌ మరింత నష్టం నలిగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌ను దాటి ప్రొసీడింగ్స్‌ పరిధిని పొడగించాల్సిన అవసరం కూడా ఉందని ట్రిబ్యునల్‌ తెలిపింది. కొవిడ్‌-19 రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపిన నేపథ్యంలో టపాసుల అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించిన ఒడిశా, రాజస్థాన్‌లకు ఎన్‌జీటీ నోటీసులు ఇవ్వలేదు. కొవిడ్‌-19 పిల్లలు, వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య కారణాలున్న వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags