Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Universities Reopen After Diwali

 


Telangana Universities Reopen After Diwali

డిసెంబర్‌ నుంచి ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ క్లాసులు..!

తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసంస్థల పునఃప్రారంభానికి చర్చలు చేపడుతోంది. 

రాష్ట్రంలో కాలేజీలు, యూనివర్సిటీల పునఃప్రారంభం కోసం యూజీసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో విశ్వవిద్యాలయాలను పునః ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దీపావళి తర్వాత విశ్వ విద్యాలయాలు పునఃప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. 

డిసెంబర్ నుంచి హైస్కూల్స్, ఇంటర్మీడియట్ వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. అలాగే.. డిగ్రీ విద్యార్థులకు 30 శాతం సిలబస్ తగ్గిస్తామని వెల్లడించారు. ఇదే క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా సిలబస్ తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో టెన్త్ పరీక్షలు, ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. 

కాగా.. ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేశామని.. మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మళ్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసులు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయని పాపిరెడ్డి ప్రకటించారు. అయితే.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని.. కరోనా నిబంధనలకు అనుగుణంగానే కాలేజీలు, స్కూళ్లు నడుస్తాయని తెలిపారు. ఒకవేళ అవసరమైతే షిప్టుల వారిగా క్లాసుల నిర్వహించే ఆలోచన చేస్తామని పేర్కొనారు. 

కరోనా ప్రభావంతో ఇప్పటికీ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇవ్వడంతో అయా విద్యాసంస్థలు తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసంస్థల పునఃప్రారంభానికి చర్చలు చేపడుతోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags