Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DRDO Scholarship 2020 For Girls Online Application Date Extended

 

DRDO Scholarship 2020 For Girls Online Application Date Extended

అమ్మాయిలకు రూ.1,86,000 స్కాలర్‌షిప్.. దరఖాస్తు గడువు పొడిగింపు 

ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్య చదవలేకపోతున్న అమ్మాయిల కోసం ప్రతీ ఏడాది డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అమ్మాయిలకు కేటాయించిన ఈ స్కాలర్‌షిప్ గడువును పొడిగించింది. డీఆర్‌డీఓ ప్రతీ ఏటా అమ్మాయిలకు రూ.1,86,000 స్కాలర్‌షిప్‌నకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిన విషయం కూడా తెలిసిందే. 

అయితే మరోసారి దరఖాస్తు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో పాటు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫలితాలు విడుదల చేయడంలో ఆలస్యమైంది. ఈ కారణాల దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి ఇప్పుడు మరో అవకాశం లభించింది. ఇక ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 

గ్రాడ్యుయేషన్ చదువుతున్న 20 మంది అమ్మాయిలకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న 10 మంది అమ్మాయిలకు ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తోంది డీఆర్‌డీఓ. ఈ స్కీమ్ అమ్మాయిలకు మాత్రమే. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ అడ్మిషన్లు పొందినవారికే ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్ వర్తిస్తుంది. 

ఈ కోర్సులు చదువుతుండాలి:

ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతూ ఉండాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. 

ఎంపిక:

గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు, JEE (Main) స్కోర్ ఆధారంగా అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు 20 మందిని ఎంపిక చేస్తారు. వారికి ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది. 

దరఖాస్తుకు వెబ్‌సైట్‌:

విద్యార్థినులు డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో https://drdo.gov.in/ లో స్కాలర్‌షిప్ స్కీమ్ వివరాలను తెలుసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) వెబ్‌సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags