Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Education Minister Ramesh Pokhriyal Webinar Highlights on CBSE, JEE and NEET 2021 Exams

 

Education Minister Ramesh Pokhriyal Webinar Highlights on CBSE, JEE and NEET 2021 Exams

2021 నీట్‌, జేఈఈ, సీబీఎస్‌ఈ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర విద్యా మంత్రి

JEE, NEET & CBSE Board Exams 2021: నేటి ఉదయం 10గంటలక నుంచి ఈ ఆన్‌లైన్‌ చర్చా వేదిక (వెబినార్‌) ప్రారంభించారు.

కరోనా వైరస్‌ అన్నీ రంగాలతో పాటు విద్యారంగానికి‌ కొత్త పరీక్ష పెట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గందరగోళంలో పడేసింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోకపోడంతో పిల్లల చదువులు ఏమైపోతాయోనన్న భయం తల్లిదండ్రులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇక పరీక్షల విషయానికొస్తే.. ఈ ఏడాది పరీక్షలు ఎంత కష్టమైన పరిస్థితుల్లో జరిగాయో.. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలిసిన విషయమే. 

ఈ నేపథ్యంలో విద్యారంగంలో నెలకొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. నేటి (డిసెంబ‌రు 10) ఉదయం 10గంటలక నుంచి ఈ ఆన్‌లైన్‌ చర్చా వేదిక (వెబినార్‌) ప్రారంభించారు.

విద్యాశాఖ మంత్రి ఇచ్చిన పిలుపుతో దేశ వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పరీక్షలపై ఆందోళన వ్యక్తంచేయడంతో పాటు పలు సూచనలు ఇస్తున్నారు. 

వచ్చే ఏడాదిలో నిర్వహించాల్సిన సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్‌, నీట్‌ వంటి పోటీ పరీక్షల నిర్వహణపై కీలకంగా చర్చించి, అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈ వెబినార్‌ కోసం #EducationMinisterGoesLive హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా ఆయా వర్గాల నుంచి ప్రశ్నలను, సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానించారు. 

జేఈఈ-2021 పై క్లారిటీ:

ఈ కార్యక్రమంలో పలు ప్రవేశ పరీక్షలపై మంత్రి స్పందించారు. ముఖ్యంగా జేఈఈ (మెయిన్‌)-2021 జనవరికి బదులుగా ఫిబ్రవరి చివరి వారంలో ఉంటుందని పేర్కొన్నారు. కానీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం డిసెంబర్‌ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక ఏప్రిల్‌ జరగాల్సిన రెండో విడత జేఈఈ (మెయిన్‌)-2021 పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే అటెంప్ట్‌ల సంఖ్యను కూడా రెండు నుంచి మూడు లేదు నాలుగు సార్లు హాజరయ్యే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 

ఆఫ్‌లైన్‌ సీబీఎస్‌ఈ పరీక్షలు:

ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు పెన్‌-పేపర్‌లో మోడ్‌లో జరగనున్నాయి. అలాగే ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి విద్యార్థులు స్కూళ్లకు పోవడం వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తామని పేర్కొన్నారు. 

నీట్‌ క్యాన్సిల్‌ ఆలోచన లేదు:

నీట్‌-2021 పరీక్షపై స్పందిస్తూ.. నీట్‌ పరీక్షను క్యాన్సిల్‌ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags