Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jagananna Amma Vodi Money on 9th January 2021: Education Minister Suresh

 

Jagananna Amma Vodi Money on 9th January 2021: Education Minister Suresh

జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి’ డబ్బు జమ: మంత్రి సురేష్

సంక్రాంతి పండుగకు ముందు జనవరి 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తల్లుల అకౌంట్లలో ‘జగనన్న అమ్మ ఒడి’ డబ్బు జమ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి రెండో విడత చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. 

‘‘అమ్మ ఒడి పొందేందుకు ఈ నెల 10 నుంచి 20 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 16 నుంచి 19 వరకు లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శన.. ఈ నెల 20 నుంచి 24 వరకు జాబితాలో తప్పుల సవరణకు అవకాశం. ఈ నెల 26న అమ్మ ఒడి లబ్దిదారుల ఫైనల్ లిస్టు ప్రదర్శన. ఈ నెల 31న జాబితాపై అన్ని జిల్లాల కలెక్టర్ల ఆమోదం.’’ ఇలా దశల వారీగా అర్హులందరికీ న్యాయం చేస్తాయని మంత్రి సురేష్ వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. గతేడాది 43,54,600 మంది లబ్ధిదారులకు ‘అమ్మ ఒడి’ కింద రూ. 6,336 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15,000 డబ్బు జమ చేస్తున్న విషయం తెలిసిందే. 

పారదర్శకంగా టీచర్ల బదిలీ

అలాగే పారదర్శకంగా, జవాబుదారితనంతో టీచర్ల బదిలీ ప్రక్రియ చేస్తున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. నాలుగు కేటగిరీలుగా విభజించి పద్ధతి ప్రకారం బదిలీలు చేస్తున్నామన్నారు. ఒకే చోట 5 ఏళ్లు, ఆపైన సర్వీసు పూర్తి చేసిన టీచర్లను తప్పని సరిగా బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో ముందు నుంచి ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు బదిలీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి 60 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండేలా బదిలీలు చేస్తున్నామన్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో పారదర్శకత కోసమే బ్లాకింగ్ చేసినట్లు తెలిపారు. బ్లాకింగ్ విషయంలో అచ్చెన్నాయుడు రెచ్చగొట్టేలా మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు. స్కూళ్ల వారీగా బ్లాకింగ్ చేసిన పోస్టుల వివరాలు కావాలంటే ఇస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయడం, విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags