Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE-Mains to be held four times in 2021: Union Education Minister

 

JEE-Mains to be held four times in 2021: Union Education Minister 

జేఈఈ మెయిన్స్‌ నాలుగుసార్లు - ఫిబ్రవరి-మే మధ్య కాలంలో ప్రతి నెలా ఒక పరీక్ష

జేఈఈ, నీట్‌ సిలబస్‌ యథాతథం

దేశవ్యాప్తంగా ఈసారి జేఈఈ మెయిన్స్‌-2021ని నాలుగుసార్లు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు తరగతి గదికి దూరమైనందున బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లోనూ ఛాయిస్‌ ఇవ్వనుంది. జాతీయస్థాయి ప్రవేశ, బోర్డు పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. జేఈఈ మెయిన్స్‌పై ఇప్పటికే పలు సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరులో ఒకటి, మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో నెలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగుసార్లు పరీక్ష నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యార్థి నాలుగు విడతల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటును పరిశీలిస్తామన్నారు. ప్రతి విడతలో 3-4 రోజుల చొప్పున పరీక్షలు ఉంటాయన్నారు. 

పాఠ్య ప్రణాళిక

ఈసారి జేఈఈ మెయిన్స్‌కు పాత పాఠ్య ప్రణాళికే (సిలబస్‌) ఉంటుందని, కాకపోతే ఛాయిస్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందని మంత్రి స్పష్టంచేశారు. ‘గతంలో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల్లో కలిపి 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చి, ఒక్కోదానిలో 25 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే ఆ మేరకు మార్కులు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’ అని చెప్పారు. నీట్‌కు కూడా గతేడాది సిలబస్‌ ఉంటుందని స్పష్టం చేశారు. నీట్‌ తేదీని కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ వైద్య కమిషన్‌తో సంప్రదించి ఖరారు చేస్తామని తెలిపారు. పరీక్ష ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా? అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags