Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీ అనుసంధానం

 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీ అనుసంధానం

ఆరోగ్యశ్రీ పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ నిర్వహించిన ప్రగతి సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ తో అనుసంధానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రధానికి సీఎస్ వివరించారు. వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై ప్రధాని సమీక్షించారు. 

ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ తో అనుసంధానిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్వాగతించారు. హైదరాబాద్ లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇతర రాష్ట్రాల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త పేదలకు అత్యాధునిక వైద్యసదుపాయం అందుతుందని గవర్నర్ పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags