Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: రెండోసారి తగ్గిన కరోనా పరీక్షల ధరలు

 

TS: రెండోసారి తగ్గిన కరోనా పరీక్షల ధరలు

తెలంగాణలో నిర్వహించే కరోనా పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి సవరించింది. ల్యాబ్ కు వెళ్లి చేసుకునే కొవిడ్ పరీక్షలు, ఇంటి వద్ద చేసే కరోనా పరీక్షల ధరల్లో మరోసారి మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పరీక్షల ధరను మొదటిసారి సవరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ల్యాబ్ లో చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.850, ఇంటి వద్ద చేసే వాటికి రూ.1,200గా నిర్ణయించింది. తాజాగా రెండో సారి సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్స్ చేసే ఆర్టీపీసీఆర్ పరీక్ష ధరను రూ.500, ఇంటి వద్ద చేసే కొవిడ్ టెస్టు ధరను రూ.750గా నిర్ణయించింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నందున మరోసారి కొవిడ్ టెస్టు ధరలను తగ్గించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags