Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: DOST - Admissions - 2020


TS: DOST - Admissions - 2020

టి‌ఎస్: బీకాంలోనే అత్యధిక ‘దోస్త్‌’లు -  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పెరిగిన ప్రవేశాలు 

రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వాణిజ్య శాస్త్రం (బీకాం)పై ఎక్కువ మంది మక్కువ చూపారు. ఈ విద్యా సంవత్సరం(2020-21)లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా మొత్తం 2,12,427 మంది డిగ్రీ కోర్సుల్లో చేరగా వారిలో అత్యధికంగా బీకాంలో 85,691 మంది ప్రవేశాలు పొందారు. ఈ సంవత్సరం కొత్తగా బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టారు. గత ఏడాది నుంచి బీఎస్‌సీని లైఫ్‌ సైన్స్, ఫిజికల్‌ సైన్స్‌గా విభజించారు. ఆ రెండింటిలో కలిపి 86,642 మంది చేరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఏడాది ఈ కళాశాలల్లో 42,987 మంది చేరగా.. ఈసారి 45,323 మంది చేరారు. ఈ ఏడాది కొత్తగా కొన్ని పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులకు దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించారు. వాటిల్లో 607 మంది ప్రవేశాలు పొందారు.

కోర్సుల వారీగా చేరిన విద్యార్థుల సంఖ్య

కోర్సు             విద్యార్థుల సంఖ్య

బీకాం              85,691

బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌   45,180

బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌     41,462

బీఏ               31,179

బీసీఏ              1010

బీబీఏ              6,944

బీబీఎం             204

బీఎస్‌డబ్ల్యూ          45

బీహోక్‌(ఒకేషనల్‌)     107

డిప్లొమా            607

మొత్తం           2,12,427

 

విశ్వవిద్యాలయాల వారీగా...

వర్సిటీ          విద్యార్థుల సంఖ్య

కేయూ          56,073

మహాత్మాగాంధీ    15,120

ఓయూ          81,448

పాలమూరు       16,670

శాతవాహన       26,027

తెలంగాణ        16,484

పాలిటెక్నిక్‌ కోర్సులు   607

Previous
Next Post »
0 Komentar

Google Tags