Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డు ఏర్పాటు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 

ఏపీ ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డు ఏర్పాటు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పేందుకు ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లానింగ్ బోర్డు ఏర్పాటు ద్వారా కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలు పరస్పర సమన్వయంతో ఉన్నత విద్యారంగంలో ఉన్నత ప్రమాణాల సాధనకు వీలుగా ముందడుగు వేయనున్నాయి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, కాలేజీ విద్య కమిషనర్, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర వర్సిటీల వైస్ చాన్సలర్లు సభ్యులుగా ఉండే ఈ బోర్డుకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags