Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

జ‌న‌వ‌రి 18 నుంచి ట్రిపుల్‌ఐటీల్లో తరగతులు

 

జ‌న‌వ‌రి 18 నుంచి ట్రిపుల్‌ఐటీల్లో తరగతులు

ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు జ‌న‌వ‌రి 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని కులపతి కేసీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్టీ కేటగిరీలో శ్రీకాకుళం ప్రాంగణంలో 9 సీట్లు మిగిలిపోయాయి. వీటిల్లో ఆంధ్ర రీజియన్‌కు సంబంధించి 2, శ్రీవేంకటేశ్వర రీజియన్‌ సంబంధించి 7 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 20వేల ర్యాంకుల వరకు పిలిచినా సీట్లు భర్తీ కాలేదు. మిగిలిన 9 సీట్లకు మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దివ్యాంగులు, క్రీడా, మాజీ సైనికోద్యోగులు, ఎన్‌సీసీ కోటా కింద 257 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానున్నందున పెండింగ్‌లో పెట్టారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు భర్తీ కావాల్సి ఉండగా 4,134 సీట్లు నిండాయి.

WEBSITE

Important Notice for the newly admitted students (16.01.2021)

Previous
Next Post »
0 Komentar

Google Tags