Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Schools Reopen in Telangana From February 1st

 

Schools Reopen in Telangana From February 1st

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం 

CM KCR: తొలుత 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

తెలంగాణలో ఫిబ్రవరి 1నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి, ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలు మూతబడిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు విద్యార్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో వచ్చేనెల 1 నుంచి క్లాసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. సోమవారం మంత్రులు, కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కూళ్ల పున: ప్రారంభంతో పాటు పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags