Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP CM Announced to Give Laptops For 9th, 10th & Inter Students

 

AP CM Announced to Give Laptops For 9th, 10th & Inter Students

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు‌.. పాడైతే వారంలో రీప్లేస్‌మెంట్‌ 

Ammavodi: ఏపీలో 9-12 తరగతి చదివే పిల్లలకు అమ్మఒడి వద్దు అనుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ సీఎం జగన్‌ ప్రకటించారు. 

ఏపీలో అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరులో నేడు ప్రారంభించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ ఒడి పథకం ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మట్లాడుతూ తొమ్మిదో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులు.. వచ్చే ఏడాది నుంచి అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు.. లేకపోతే డబ్బులు వద్దు..ల్యాప్‌టాప్‌లు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ. 25వేల నుంచి రూ.27వేలు ఉంటుందని.. సాధ్యమైనంత తక్కువ ధరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ల్యాప్‌టాప్‌లకు మూడేళ్లు వారంటీ.. పాడైతే వారంలో రీప్లేస్ చేస్తామన్నారు. వసతి దీవెన అందుకుంటున్న వారికి కూడా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు పేదింటి పిల్లలు ఇబ్బందిపడుతున్నారని.. ఈ పరిస్థితిని మార్చాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నామన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags