Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

మార్చి 7 లోపు జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 స్కోర్‌ వెల్లడి

 

మార్చి 7 లోపు జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 స్కోర్‌ వెల్లడి

దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 స్కోర్‌ను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) మార్చి 7వ తేదీలోపు వెల్లడించనుంది. పేపర్‌-1 పరీక్షలు ఈ నెల 26వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-1కు మొత్తం 6,52,490 మంది దరఖాస్తు చేయగా వారిలో 6,20,153 (95 శాతానికిపైగా) మంది పరీక్షలు రాశారు. అందులో ఈడబ్ల్యూఎస్‌ కోటా అభ్యర్థులు 63,400 మంది ఉన్నారు. పేపర్‌-1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో పేపర్‌-1లో విద్యార్థులు సాధించిన స్కోర్‌ను మార్చి 7వ తేదీలోపు వెల్లడించనున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లోనూ పేపర్‌-1 పరీక్ష జరగనుంది.

* పేపర్‌-2 (బీఆర్క్‌/బీప్లానింగ్‌) పేపర్‌-2 చివరి విడత పరీక్షని మే నెలలో నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్షకు 51,229 మంది హాజరయ్యారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags