Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

 

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు  కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, ఖమ్మం-వరంగల్‌-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14న పోలింగ్‌ జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

ఎన్నికల ప్రక్రియ

* నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 23

* నామినేషన్ల పరిశీలన -ఫిబ్రవరి 24

* నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 26

* పోలింగ్‌- మార్చి 14 ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

* ఓట్ల లెక్కింపు మార్చి - 17

Previous
Next Post »
0 Komentar

Google Tags