Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: ఎడ్ సెట్ కు కొత్త పరీక్ష విధానం - డిగ్రీలో ఏ కోర్సు చదివినా ఒకటే ప్రశ్నాపత్రం

 

టి‌ఎస్:  ఎడ్ సెట్ కు కొత్త పరీక్ష విధానం - డిగ్రీలో ఏ కోర్సు చదివినా ఒకటే ప్రశ్నాపత్రం

మార్చి 20న నోటిఫికేషన్ జారీ

వచ్చే విద్యాసంవత్సరం(2021-22) బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటున్నారా? ఈసారి తెలంగాణ ఎడ్ సెట్ అర్హత సాధించడం సులభం కాదు. పరీక్ష విధానం మారడమే అందుకు కారణం. ఫిబ్రవరి 27న జరిగిన ఎడ్ సెట్ కమిటీ సమావేశంలో పరీక్ష విధానాన్ని మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో సమావేశం జరిగింది. ఎడ్ సెట్ కన్వీనర్ ఆచార్య ఎ.రామకృష్ణ, ఓయూ రిజిస్టార్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 అంశాలపై చర్చించారు. కాలపట్టికను ఖరారు చేశారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags